కొత్త వ్యవసాయ చట్టాల రద్దుకు ఆందోళన
ABN , First Publish Date - 2021-03-07T06:42:27+05:30 IST
కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పెదగుమ్ములూరులో వ్యవసాయ కార్మికులు ఆందోళన చేపట్టారు.
ఎస్.రాయవరం, మార్చి 6 : కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం పెదగుమ్ములూరులో వ్యవసాయ కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.సత్యనారాయణ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో కార్మికులు జెండాలు చేతబట్టి నినాదాలు చేశారు.