డీఎంఈ ఆఫీస్ వద్ద Telangana సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

ABN , First Publish Date - 2022-06-28T18:15:42+05:30 IST

నగరంలోని డీఎంఈ ఆఫీస్ వద్ద తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగారు.

డీఎంఈ ఆఫీస్ వద్ద Telangana సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల ఆందోళన

హైదరాబాద్: నగరంలోని డీఎంఈ ఆఫీస్ వద్ద తెలంగాణ (Telangana) సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. రాష్ట్రంలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు జాయిన్ అయినప్పటి నుంచి జీతాలు ఇవ్వడం లేదంటూ నిరసన చేపట్టారు. ఎనిమిది నెలలుగా తెలంగాణలో పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్స్‌కు స్టైఫండ్ అందని పరిస్థితి. ఈ విషయంపై గత కొన్ని రోజులుగా హాస్పిటల్స్ ముందు వారు నిరసన చేపట్టారు. అధికారులకు వినతిపత్రం ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ తమ ఆందోళనను ఉధృతం చేసింది. రేపు ఓపీ విధులను బహిష్కరించాలని నిర్ణయించింది. స్టైఫండ్ గురించి ప్రకటన చేయకపోతే..  ఎల్లుండి నుంచి ఎమర్జెన్సీ సేవలు కూడా బాయ్ కాట్ చేయనున్నట్లు తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. 

Updated Date - 2022-06-28T18:15:42+05:30 IST