ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకుల ఆందోళన
ABN , First Publish Date - 2022-02-02T02:28:25+05:30 IST
జిల్లాలోని ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పమ్మిలో
ఖమ్మం: జిల్లాలోని ముదిగొండలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేశారు. పమ్మిలో సబ్స్టేషన్ నిర్మాణ స్థలంలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అంబేద్కర్ విగ్రహాన్ని అధికారులు తొలగించారు. పమ్మిలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి తహశీల్దార్ కార్యాలయంలో అధికారులు ఉంచారు. అక్కడినుంచి అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకెళ్లేందుకు ఎమ్మార్పీఎస్ నేతలు ప్రయత్నించారు. ఈ ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అంబేద్కర్ విగ్రహంతో ఖమ్మం-కోదాడ రహదారిపై బైఠాయించి ఎమ్మార్పీఎస్ నేతలు ఆందోళన చేశారు.