వరద బాధితుల ఆందోళన

ABN , First Publish Date - 2020-11-01T06:42:30+05:30 IST

వరదలతో నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఆందోళనకు దిగారు.

వరద బాధితుల ఆందోళన

నష్టపోయిన వారందరికీ  పరిహారం చెల్లించాలి 

దమ్మాయిగూడ మునిసిపాలిటీ ఎదుట భవానీనగర్‌ కాలనీ వాసుల నిరసన


కీసర రూరల్‌ : వరదలతో నష్టపోయిన వారందరికీ పరిహారం చెల్లించాలని దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని భవానీనగర్‌ కాలనీవాసులు ఆందోళనకు దిగారు. శనివారం కాలనీవాసులు మున్సిపల్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ధాటికి కాలనీలో దాదాపు ఇళ్లన్నీ నీటిలో మునిగినప్పటికీ, కొందరికే నష్టపరిహారం చెల్లించటమేంటని అధికారులను నిలదీ శారు. కమిషనర్‌, చైర్మన్‌తో వాగ్వాదానికి దిగారు. వైస్‌చైర్మన్‌ మాదిరెడ్డి నరేందర్‌రెడ్డి కల్పించుకుని ఆందోళనకారులతో చర్చించి, ప్రస్తుతపరిస్థితుల గురించి వారికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ  ఇంట్లో వస్తువులన్నీ వరదనీటిలో తడిశాయని, వారంరోజుల పాటు మురుగులోనే గడిపినప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు అటువైపు కన్నెత్తి చూడలేదని  ఆవేదన వ్యక్తం చేశారు.


నాయకులకు అనుకూలంగా ఉండే వారికి మాత్రమే  ప్రభు త్వం ఇస్తున్న రూ. పదివేలు ముట్టచెప్తున్నారని ఆరోపించారు. ఇదే విషయమై మున్సి పల్‌ చైర్‌పర్సన్‌ ప్రణీత, కమిషనర్‌ స్వామిలను వివరణ  కోరగా మున్సిపల్‌ పరిధిలో మొత్తం 786 మందిని వరద బాధితులుగా గుర్తించామని, అందులో 300మంది భవానీ నగర్‌లోనే ఉన్నారన్నారు. వారిలో 100 మందికి పరిహారం అందజేయటం జరిగిందని తెలిపారు. మిగతా వారికి పంపిణీ చేయాల్సి ఉందని వెల్లడించారు. అని వార్య కారణాలవల్ల  వరదబాధితులకు పరిహారం పంపిణీని వాయిదా వేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో బాధితులకు డబ్బుల చెల్లింపులను నిలిపివేసినట్లు తెలిపారు. తదుపరి ఆదేశాల మేరకు పంపిణీ  చేస్తా మని వారు వివరించారు.

Updated Date - 2020-11-01T06:42:30+05:30 IST