వేతనాలు చెల్లించాలని వైద్యుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-30T05:41:54+05:30 IST
వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట సినియర్ రెసిడెంట్ వైద్యులు బుధవారం ఆందోళన నిర్వహించారు.
జగిత్యాల టౌన్, జూన్ 29 : వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల ఎదుట సినియర్ రెసిడెంట్ వైద్యులు బుధవారం ఆందోళన నిర్వహించారు. జీవితం సాగాలంటే జీతం కావాలని కోరుతూ వైద్యులు ఫ్లకార్డుల ప్రదర్శన నిర్వహించారు. జిల్లాకు ప్రభుత్వం మెడికల్ కళాశాలతో పాటు మాతా, శిశు సంరక్షణ కేంద్రాన్ని మంజూరు చేయడంతో పాటు సుమారు 25 మందికి పైగా సీనియర్ రెసి డెంట్ వైద్యులను నియమించింది. నాలుగు నెలలుగా వైద్యులకు ప్రభు త్వం వేతనాలు చెల్లించకపోవడంతో పలుమార్లు కళాశాల ప్రిన్సిపాల్ శివ రాం ప్రసాద్తో పాటు సూపరింటెండెంట్ రాములు దృష్టికి తీసుకువెళ్లారు. అయినప్పటికీ వేతనాలు విడుదల కాలేదు. దీంతో బుధవారం వైద్యులు కళాశాల ఎదుట నిరసన ప్రధర్శన నిర్వహించారు. అనంతరం వారు మా ట్లాడుతూ సరైన సమయంలో వేతనాలు అందక వేదన పడుతున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. తక్షణమే వేతనాలు విడుదల చే యాలని డిమాండ్ చేశారు.