ఐదవ రోజుకు చేరిన బాసర IIIT విద్యార్థుల ఆందోళన
ABN , First Publish Date - 2022-06-18T13:15:35+05:30 IST
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళన ఐదవ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.
నిర్మల్: బాసర ట్రిపుల్ ఐటీ(Basara IIIT) విద్యార్థుల ఆందోళన ఐదవ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడంపై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్న హామీని తోసిపుచ్చారు. ఈ రోజు కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు క్యాంపస్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది. నిజామాబాద్- భైంసా రూట్లలో పికెటింగ్లు ఏర్పాటు చేశారు.