సాయిబాబా ఆలయంలో దర్శనవేళల కుదింపు
ABN , First Publish Date - 2021-04-19T06:12:45+05:30 IST
కొవిడ్-19 రెండోదశ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణ దృష్ట్యా వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీసాయిబాబా ఆలయంలో ఈనెల 19 నుంచి జూన 1వ తేదీ వరకు దర్శన వేళలను కుదిస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సేవాసంఘం అధ్యక్షుడు జయచంద్రచౌదరి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు.
అనంతపురం టౌన, ఏప్రిల్ 18 : కొవిడ్-19 రెండోదశ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైరస్ నివారణ దృష్ట్యా వేమన టెలిఫోన భవన ఎదురుగా ఉన్న షిర్డీసాయిబాబా ఆలయంలో ఈనెల 19 నుంచి జూన 1వ తేదీ వరకు దర్శన వేళలను కుదిస్తున్నట్లు షిర్డీ సాయిబాబా సేవాసంఘం అధ్యక్షుడు జయచంద్రచౌదరి ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతిరోజు ఉదయం 5.30 నుంచి 8.30 వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7.30 వరకు మాత్రమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. అన్ని సేవాకార్యక్రమాలను సైతం జూన 1వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.