కరోనాపై వలంటీర్లతో సమగ్ర సర్వే

ABN , First Publish Date - 2020-04-08T09:48:19+05:30 IST

కరోనా వైర్‌సకు అడ్డుకట్టవేయడానికి వలంటీర్లతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే

కరోనాపై వలంటీర్లతో సమగ్ర సర్వే

అనంతపురం రూరల్‌, ఏప్రిల్‌ 7: కరోనా వైర్‌సకు అడ్డుకట్టవేయడానికి వలంటీర్లతో సమగ్ర సర్వే నిర్వహిస్తున్నట్లు అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు రాజీవ్‌కాలనీ వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ చేపట్టారు.


ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని కూరగాయలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఇళ్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి అనుమానాలున్నా తక్షణమే వలంటీర్ల దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. ప్రజలంతా వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. అత్యవసర పనులుంటే తప్ప బయటికి వెళ్లరాదన్నారు. ప్రజల ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఉచితంగా రేషన్‌ పంపిణీ చేస్తున్నామన్నారు. ఈనెల 15నుంచి రెండవ విడత పంపిణీ చేస్తామన్నారు. కొంతమంది రేషన్‌ కా ర్డుదారులకు రూ.1000 చొప్పున ఆర్థికసాయం అందడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వారందరికీ తప్పకుండా అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2020-04-08T09:48:19+05:30 IST