సమగ్ర విచారణ చేయించాలి: పవన్‌

ABN , First Publish Date - 2020-08-10T09:39:52+05:30 IST

ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దుర్ఘటనపై ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన

సమగ్ర విచారణ చేయించాలి: పవన్‌

అమరావతి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఘటనపై సమగ్ర విచారణ చేయించాలని జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రభుత్వాన్ని కోరారు. దుర్ఘటనపై  ఓ ప్రకటనలో తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన దురదృష్టకరమని పేర్కొన్నారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యసహాయం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఘటనకు కారణాలేమిటి? లోపాలు ఏమిటో? గుర్తించాలన్నారు. వివిధ హోటళ్లు, భవనాల్లో నిర్వహిస్తున్న కొవిడ్‌ కేంద్రాల్లో రక్షణ చర్యలపై తక్షణం సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించారు.

Updated Date - 2020-08-10T09:39:52+05:30 IST