కిడ్నీ తీసుకుని మోసం చేశారు

ABN , First Publish Date - 2021-04-13T05:27:56+05:30 IST

v

కిడ్నీ తీసుకుని మోసం చేశారు

రూరల్‌ ఎస్పీకి బాధితుడి ఫిర్యాదు

గుంటూరు, ఏప్రిల్‌ 12: నీవు బతికినంతకాలం పోషణతోపాటు నీ కూతురికి వివాహం కూడా జరిపిస్తామని నమ్మకంగా మాయమాటలు చెప్పి తన కిడ్నీ తీసుకుని ఆ తర్వాత స్పందించటం లేదని చెరుకుపల్లి మండలం గుళ్లపల్లికి చెందిన వడ్లమాను వెంకటేశ్వరరావు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను గ్రామంలో ఇస్ర్తీ చేసుకుని జీవనం సాగిస్తున్నాన్నారు. అయితే గ్రామానికి చెందిన నా మేనమామ ఓగిరాల సుబ్బయ్య పెద్దల్లుడు పోతార్లంక శ్రీనివాసరావుకు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయన్నారు. ఈ క్రమంలో మేనమామ సుబ్బయ్య తన అల్లుడికి ఓ కిడ్నీ దానం చేయాలని, భవిష్యత్తులో నీ కూతురి వివాహం కూడా మేమే చేయిస్తామని నమ్మకంగా చెప్పాడన్నారు. మాట నమ్మిన తాను 2015లో కిడ్నీ ఇచ్చానని, అయితే అప్పటి నుంచి వారు తనను పట్టించుకోలేదన్నారు. తన ఆరోగ్య పరిస్థితి ప్రమాదకరంగా తయారైందని, తనకు స్థలం ఇస్తామని చెప్పి చివరకు పోరంబోకు స్థలం అంటగట్టి మోసం చేశారని, తనకు న్యాయం చేయాలని ఆయన రూరల్‌ ఎస్పీని ఆశ్రయించారు. 


Updated Date - 2021-04-13T05:27:56+05:30 IST