నె లాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయండి
ABN , First Publish Date - 2020-12-06T05:52:45+05:30 IST
ఈ నెలాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో హెచ్ఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
డీఈవో లింగేశ్వరరెడ్డి
రావికమతం, డిసెంబరు 5: ఈ నెలాఖరులోగా నాడు-నేడు పనులు పూర్తిచేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి బి.లింగేశ్వరరెడ్డి ఆదేశించారు. మండల పరిషత్ కార్యాలయంలో హెచ్ఎంలతో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని 31 పాఠశాలల్లో సుమారు రూ.7 కోట్లతో చేపట్టిన పనులపై ఆరా తీయగా, 60 శాతం పూర్తయ్యాయని హెచ్ఎంలు తెలిపారు. అలాగే విద్యా కానుక కిట్ల పంపిణీపై డీఈవో ఆరా తీశారు. చదవడం మాకిష్టం కార్యక్రమంపై వర్క్ సీట్లు సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లాలో సోమవారం నుంచి కాగ్ బృందం పర్యటించనున్నందన అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతకుముందు భోజన పథకం, డ్రై రేషన్ రికార్డులను పరిశీలించారు. సమావేశంలో ఇన్చార్జి ఎంఈవో కిరణ్మయి పాల్గొన్నారు.