ముగిసిన ఇంటర్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-20T06:02:10+05:30 IST

జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి.

ముగిసిన ఇంటర్‌ పరీక్షలు
పరీక్షల అనంతరం విద్యార్థుల కేరింతలు

సూర్యాపేట అర్బన్‌, నేరేడుచర్ల, మఠంపల్లి, మే 19: జిల్లాలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారంతో ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 32 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా, జనరల్‌ విభాగంలో 6,970 మంది విద్యార్థులకు 6,478 మంది హాజరుకాగా, 492 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్‌ విభాగంలో 812 మంది విద్యార్థులకు 692 మంది హాజరుకాగా, 120 మంది గైర్హాజరయ్యారు. కాగా, పరీక్షలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పరీక్షలు ముగియడంతో విద్యార్థులు హాస్టల్స్‌ను ఖాళీచేసి తోటి విద్యార్థులకు వీడ్కోలు పలికి, సెల్ఫీలు దిగి సొంత గ్రామాలకు ఆనందంగా చేరారు. దీంతో బస్టాండ్లలో సందడి ఏర్పడింది. 

Updated Date - 2022-05-20T06:02:10+05:30 IST