నాలుగు రోజుల్లోగా పనులు పూర్తి చేయండి
ABN , First Publish Date - 2021-07-25T05:18:41+05:30 IST
పాఠశాలల్లో ‘నాడు- నేడు’ కింద చేపట్టిన అభి వృద్ధి పనులను నాలుగు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారి ఆదేశించారు. కస్తూర్బా, కోరాడ ఎంపీపీ పాఠశాలలను సందర్శించి పనులను, రికార్డులను పరిశీలించారు.
ఆర్జేడీ జ్యోతికుమారి
కొత్తూరు: పాఠశాలల్లో ‘నాడు- నేడు’ కింద చేపట్టిన అభి వృద్ధి పనులను నాలుగు రోజుల్లో పూర్తిచేసి నివేదిక అందించాలని విద్యాశాఖ ఆర్జేడీ జ్యోతికుమారి ఆదేశించారు. శనివారం కస్తూర్బా, కోరాడ ఎంపీపీ పాఠశాలలను సందర్శించి పనులను, రికార్డులను పరిశీలించారు. కస్తూర్బా పాఠశాలలో పూర్తి స్థాయిలో పనులు జరగకపోవడం, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడంపై ప్రిన్సిపాల్ను ప్రశ్నించారు. ఎంపీపీ పాఠశాల హెచ్ఎం గైర్హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో ఎంఈవో రాంబాబు, సర్వశిక్షాభియాన్ పీవో తిరుమల చైతన్య, పగడాలమ్మ, విజయకుమారి పాల్గొన్నారు.