కర్ణాటకలో జూలై 14 నుంచి 23 వరకు పూర్తిగా లాక్ డౌన్: సీఎంవో

ABN , First Publish Date - 2020-07-12T02:19:41+05:30 IST

కర్ణాటకలో జూలై 14 నుంచి 23 వరకు పూర్తిగా లాక్ డౌన్: సీఎంవో

కర్ణాటకలో జూలై 14 నుంచి 23 వరకు పూర్తిగా లాక్ డౌన్: సీఎంవో

బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటక రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జూలై 14 నుంచి 23 వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది. పెరుగుతున్న కోవిడ్ -19 కేసులను దృష్టిలో ఉంచుకుని జూలై 14న రాత్రి 8 గంటల నుంచి జూలై 23 ఉదయం 5 గంటల వరకు బెంగళూరు పట్టణ, గ్రామీణ జిల్లాల్లో పూర్తిగా లాక్ డౌన్ అమల్లో ఉంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. నిత్యావసర సేవలకు మినహాయింపు ఉంటుందని సీఎంవో పేర్కొంది.



Updated Date - 2020-07-12T02:19:41+05:30 IST