అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-05-18T05:07:27+05:30 IST

‘సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలి, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి’ అంటూ కలెక్టర్‌ విజయరా మరాజు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదే శించారు.

అభివృద్ధి  పనులు త్వరగా పూర్తి చేయండి
అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తున్న కలెక్టర్‌ విజయరామరాజు

వేంపల్లె, మే 17: ‘సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలి, అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి’ అంటూ కలెక్టర్‌ విజయరా మరాజు అధికారులు, కాంట్రాక్టర్లను ఆదే శించారు. వేంపల్లెలో కోట్లాది రూపాయల తో జరుగుతున్న పనులను పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. మొదట కడప రోడ్డులో ఉన్న పార్కును పరిశీలించారు. జూలైలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ద్వారా వేంపల్లెలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రారంభించాల్సి ఉందన్నారు.

పెండింగ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని సూచించారు. అనంతరం జడ్పీ బాలుర, బాలికల హైస్కూల్‌ పనులను, రాయచోటి బైపాస్‌ రోడ్డులోని ఉర్దూ జూనియర్‌ కళాశాల భవన పనులు, పులివెందుల రోడ్డులోని ఫైర్‌ స్టేషన్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు రవికుమార్‌రెడ్డి, ఎంపీపీ గాయత్రి, తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

పులివెందులలో అధికారుల సమీక్ష

పులివెందుల టౌన్‌, మే 17: పులివెందుల మోడల్‌ టౌన్‌కు సంబంధించి రూ.630కోట్లతో 29 విభాగాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్‌ విజయరామరాజు అధికారులను ఆదేశించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో అన్ని శాఖల అధికారులతో సమీక్షించిన కలెక్టర్‌కు మోడల్‌ టౌన్‌ అభివృద్ధి పనుల ను అధికారులు వివరించారు. రాయలాపురం బ్రిడ్జి మ్యాప్‌ను పరిశీలించారు. నగరవనం పనుల గురించి, కదిరి రోడ్డు వద్ద జరుగుతున్న పనుల గురించి, హైవే భూసేకరణ విషయాలపై చర్చించారు. అంతకుముందు కొత్తగా నిర్మిస్తున్న గర్ల్స్‌ కళాశాలను, కూరగాయల మార్కెట్‌ను పరిశీలించారు. 

Updated Date - 2022-05-18T05:07:27+05:30 IST