సమగ్ర భూ సర్వే త్వరగా పూర్తి చేయండి

ABN , First Publish Date - 2022-07-06T05:30:00+05:30 IST

తంబళ ్లపల్లె మండలంలో చేపడుతు న్న సమగ్ర భూ సర్వేను వేగ వంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా ఆదేశిం చారు.

సమగ్ర భూ సర్వే త్వరగా పూర్తి చేయండి
భూ సర్వేపై రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ గిరీషా

తంబళ్లపల్లె, జూలై 6: తంబళ ్లపల్లె మండలంలో చేపడుతు న్న సమగ్ర భూ సర్వేను వేగ వంతం చేసి త్వరిత గతిన పూర్తి చేయాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ గిరీషా ఆదేశిం చారు. బుధవారం కలెక్టర్‌ తం బళ్లపల్లె మండలం మొదట కోట కొండ పంచాయతీలో చేప డుతు న్న జగనన్న భూ హక్కు, భూ రక్ష రీ సర్వే పనులను పరిశీలించారు. ఉమ్మడి కుటుంబాలు, ఎక్స్‌టెన్ట్షన్‌ వేరియేషన్‌ తదితర అంశాలు, రీ సర్వేలో ఎదురవుతున్న సమస్యలపై స్థానిక రైతులతో మాట్లాడి రీ సర్వేపై వారిలో నెలకొన్న అనుమానాలు నివృత్తి చేస్తూ రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కన్నెమడుగు సచివాల యాన్ని కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యక్రమంలో మదనపల్లె ఆర్డీవో మురళి, జిల్లా సర్వే  భూమి రికార్డుల అధికారి జయరాజ్‌, డీపీవో లక్ష్మీ, తహసీల్దారు భీమేఽశ్వరరావు, ఆర్‌డబ్ల్యూ ఎస్‌ డీఈ శ్రీహరి, హౌసింగ్‌ డీఈ నాగరాజు,ఎంపీడీవో దివాకర్‌రెడ్డి, ఏపీడీ నందకుమార్‌రెడ్డి, సర్వే, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-06T05:30:00+05:30 IST