మల్లారెడ్డికి ఫిర్యాదులు
ABN , First Publish Date - 2020-10-24T10:16:47+05:30 IST
వరదల్లో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం చెల్లిస్తూ మరికొంత మందికి మొండి చేయి చూపిస్తున్నారని పలువురు భాధితులు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు
ఘట్కేసర్ : వరదల్లో నష్టపోయిన వారిలో కొందరికే పరిహారం చెల్లిస్తూ మరికొంత మందికి మొండి చేయి చూపిస్తున్నారని పలువురు భాధితులు మంత్రి మల్లారెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఘట్కేసర్లోని బుగ్గానగర్లో పర్యటించిన ఆయనకు విషయం తెలిపారు. ఒకే ఇంటిలో ముగ్గురు అన్నదమ్ముల కుటుంబాలున్నాయని, అందరి గదుల్లోని సామాన్లు పాడయ్యాయని, అధికారులు మాత్రం ఇద్దరి పేర్లే నమోదు చేశారని తెలిపారు. అందరికీ న్యాయం జరిగేటట్లు చూడాలని అక్కడున్న అధికారులను మంత్రి ఆదేశించారు.