చిత్తూరు జిల్లా జనసేన నేతపై మరిన్ని ఫిర్యాదులు
ABN , First Publish Date - 2020-06-07T15:35:27+05:30 IST
2018లో దయారాం నగరంలోని మిట్టూరులో ఓ సొసైటీని ఏర్పాటు చేశారు.
చిత్తూరు : తక్కువ ఖర్చుతో ఖరీదైన ఇళ్లు కట్టిస్తామని చెప్పి మోసం చేసిన ఆరోపణలపై చిత్తూరుకు చెందిన జనసేన నాయకుడు దయారాంపై స్థానిక వన్టౌన్ స్టేషన్లో కేసు నమోదైన విషయం విదితమే. కాగా.. 2018లో దయారాం నగరంలోని మిట్టూరులో ఓ సొసైటీని ఏర్పాటు చేశారు. తక్కువ ఖర్చులోనే ఇళ్లు కట్టిస్తానంటూ వంద మంది సభ్యుల నుంచి రూ.25వేల వంతున రిజిస్ట్రేషన్ ఫీజుగా కట్టించుకున్నారు.
అధికశాతం లక్షల రూపాయలు చెల్లించినా ఇళ్ల నిర్మాణం జాడలేదు. ఈ విషయమై ఆయన నుంచి స్పందన లేకపోవడంతో, శుక్రవారం పలువురు బాధితులు వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం కూడా పలువురు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు మిట్టూరులో జనసేన నేత నిర్వహిస్తున్న సొసైటీ కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు. కాగా అక్కడ ఎలాంటి ఆధారాలు లభించలేదని తెలిసింది.