సర్పంచ్‌ భర్తపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-04-09T05:41:47+05:30 IST

రూరల్‌ మండలం ధర్మారం(ఎం) గ్రామ సర్పంచ్‌ అన్నం సునీత, ఆమె భర్త అన్నం రాంగోపల్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఉపసర్పంచ్‌ ఆసరి శ్రీనివాస్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత, డీపీవో జయసుధలకు లిఖితపూర్వక ఫిర్యాదుచేశారు.

సర్పంచ్‌ భర్తపై కలెక్టర్‌కు ఫిర్యాదు

నిజామాబాద్‌ రూరల్‌, ఏప్రిల్‌ 8: రూరల్‌ మండలం ధర్మారం(ఎం) గ్రామ సర్పంచ్‌ అన్నం సునీత, ఆమె భర్త అన్నం రాంగోపల్‌రెడ్డి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని ఉపసర్పంచ్‌ ఆసరి శ్రీనివాస్‌ కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి, అదనపు కలెక్టర్‌ బి.ఎస్‌.లత, డీపీవో జయసుధలకు లిఖితపూర్వక ఫిర్యాదుచేశారు. గురువారం  కలెక్టర్‌ ప్రాంగణంలో ధర్మారం (ఎం) సర్పంచ్‌ అన్నం సునీత స్థానంలో ఆమె భర్త పెత్తనం చెలాయిస్తున్నాడని, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని, దొంగ బిల్లులు పెడుతూ ప్రశ్నిస్తున్నవారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాడని తెలిపారు. ఆయనకు సహకరించని పంచాయతీ కార్యదర్శిని, ఉపసర్పంచ్‌ అయిన తనపై దుర్భాషలాడుతున్నాడని ఫిర్యాదుచేశారు. తీర్మానం లేకుండా, సమాచారం ఇవ్వకుండా పనులు చేస్తూ అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న సర్పంచ్‌ భర్తపై చర్యలు తీసుకోవాలని కోరారు.  

Updated Date - 2021-04-09T05:41:47+05:30 IST