లాక్డౌన్కు తిలోదకాలు!
ABN , First Publish Date - 2020-04-10T06:03:51+05:30 IST
వెంకటాచలం మండలంలోని ఎగువమిట్ట గ్రామంలో లాక్డౌన్కు విరుద్ధంగా ఫంక్షన్ నిర్వహిస్తున్నారంటూ నెల్లూరు రూరల్
ఎగువమిట్టలో విందు
పోలీసులకు ఫిర్యాదు
వెంకటాచలం, ఏప్రిల్ 9 : వెంకటాచలం మండలంలోని ఎగువమిట్ట గ్రామంలో లాక్డౌన్కు విరుద్ధంగా ఫంక్షన్ నిర్వహిస్తున్నారంటూ నెల్లూరు రూరల్ డీఎస్పీకి ఆ గ్రామస్థులతోపాటు, గ్రామ వలంటీర్లు ఫిర్యాదు చేశారు. జిల్లాను రెడ్ జోన్గా ప్రకటించారని, ఈ సమయంలో ఎలాంటి ఫంక్షన్లు నిర్వహించడం మంచిది కాదని తాము సూచించినందుకు బెదిరించారన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందుకు బయటి ప్రాంతాలకు చెందిన వారి బంధువులు, స్నేహితులతోపాటు, స్థానికులు భారీగా హాజరయ్యారన్నారు.
తమ గ్రామానికి దగ్గర్లో కృష్ణపట్నం పోర్టు ఉండడంతో లారీ డ్రైవర్లు, క్లీనర్లతోపాటు, చైనా, ఇతర దేశస్ధుల రాకపోకలు ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో తమకు కరోనా పరీక్షలు చేయించాలని, ఫంక్షన్ నిర్వహించిన ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో అవుట్ సోర్సింగ్ శానిటరీ సూపర్వైజర్గా పని చేస్తున్న మల్ల విజయ్కుమార్తోపాటు, పాకం శ్రీనివాసులు, ఏగురు రవీంద్ర, నెల్లూరు అనిల్కుమార్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.