రూరల్ ఎంపీపీ భర్తపై బాజిరెడ్డికి ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-01-16T05:11:38+05:30 IST
రూరల్ ఎంపీపీ బానోతు అనూష భర్త బానోతు ప్రేమ్ నాయక్పై రూరల్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్కు ఫిర్యాదుచేశారు.
నిజామాబాద్ రూరల్, జనవరి 15 : రూరల్ ఎంపీపీ బానోతు అనూష భర్త బానోతు ప్రేమ్ నాయక్పై రూరల్ మండల సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్కు ఫిర్యాదుచేశారు. శుక్రవారం బాజిరెడ్డి నివాసానికి వచ్చిన నేతలు ఎమ్మెల్యేకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మండలంలో జరుగుతున్న పరిణామాలు వివరించారు. ఎంపీపీ భర్త ప్రేమ్ నాయక్ జోక్యం మితిమీరుతోందని, ఎవరినీ లెక్కచేయడం లేదని, ఎలాంటి సమాచారం ఎవ్వరికీ ఇవ్వకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఫిర్యాదుచేశారు. తీర్మానాలపై సంతకాలు చేయకుండా జాప్యం చేస్తున్నరని, ఆయనను ప్రశ్నించినవారిపై పరుష పదజాలం వాడుతున్నరని వాపోయారు. ఎంపీపీ చాంబర్ను సైతం సొంత కార్యాలయంగా వాడుతున్నారని, బయటి వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని బాజిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. త్వరలోనే అందరితో సమావేశం ఏర్పాటుచేసి దిశానిర్దేశం చేస్తానని భరోసా ఇచ్చారు. రూరల్ మండలంలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సర్పంచ్లు బాజిరెడ్డిని కోరారు. తన నిధుల్లోంచి రూ.5లక్షలు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి తెలిపారు. ఎమ్మెల్యేను కలిసినవారిలో వైస్ ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్లున్నారు.