సాంఘిక బహిష్కరణ విధించారని ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-10-01T10:15:35+05:30 IST
గ్రామ పెద్దలు తమకు బహిష్కరణ విధించి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ముప్కాల్ మం డలం నాగంపేట్ గ్రామానికి చెందిన
ముప్కాల్, సెప్టెంబరు30: గ్రామ పెద్దలు తమకు బహిష్కరణ విధించి తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని ముప్కాల్ మం డలం నాగంపేట్ గ్రామానికి చెందిన గురుడికాపు సంఘ సభ్యులు బుధవారం నాయబ్ తహసీల్దార్ విక్రమ్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ 68 కుటుంబాలకు గ్రామ స్థుల నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందకుండా గ్రామ పెద్దలు హుకూం జారీ చేశారని తెలిపారు. హోటళ్లు, కల్లు దుకా ణం, మినరల్ వాటర్, ఎలక్రికల్ దుకాణాలు, బీడీ కార్ఖానాల్లోకి తమ కులస్థులు రాకుండా తమ కులంపై నిషేధం విధించారని వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చే శారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ తహసీల్ కార్యాల యంలో నాయబ్ తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన ఆయన విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.