దుర్గగుడి ధ్వంసంపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-09-25T10:47:43+05:30 IST
దుర్గగుడి ధ్వంసంపై ఫిర్యాదు
పోలాకి: గుప్పెడుపేట తీరంలోని దుర్గ గుడిని గురువారం సాయంత్రం ధ్వంసం చేయడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ధర్మకర్త లబ్బకొర్లయ్య భార్య ధనలక్ష్మి చెప్పారు. లబ్బగురువులు, లబ్బరాజమ్మ, నూకయ్య, సరస్వతిపై అనుమానం ఉన్నట్లు తెలిపారు. గుడి తలుపులు గడియలు, గొడలు పాడుచేశారని, ఖరీదైన వస్తువులు పోయాయని చెప్పారు.తన భర్త ఉపాఽధి నిమిత్తం దూరప్రాంతాలకు వెళ్లారని, ఈనేపథ్యంలో కుటుంబంపై దాడిచేస్తారన్న భయాందోళన చెందుతున్నట్లు తెలిపారు. న్యాయ విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.