శ్యామ్‌ కే నాయుడిపై మరోసారి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-01-23T12:49:32+05:30 IST

సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడిపై సినీనటి..

శ్యామ్‌ కే నాయుడిపై మరోసారి ఫిర్యాదు

హైదరాబాద్/అమీర్‌పేట : సినిమాటోగ్రాఫర్‌ శ్యామ్‌ కే నాయుడిపై సినీనటి శ్రీసుధ శుక్రవారం ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను గతేడాది అతడిపై పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఐదేళ్లు కలిసి ఉన్న అనంతరం శ్యామ్‌ కే నాయుడు తనను మోసం చేశాడని శ్రీసుధ గతేడాది ఎస్సార్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సినీఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, స్టిల్‌ ఫొటోగ్రాఫర్‌ సాయిరాం మాగంటి ఈ కేసులో రాజీ కుదుర్చుకోవాలని బెదిరించారని, మాదాపూర్‌లోని చిన్నా నివాసానికి తనను పిలిపించి దూషించడంతోపాటు దాడికి పాల్పడ్డారని, వారి నుంచి ప్రాణహాని ఉందని తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు కేసును మాదాపూర్‌ పీఎ్‌సకు బదిలీ చేస్తామని తెలిపారు.

Updated Date - 2021-01-23T12:49:32+05:30 IST