కుక్కపిల్ల కనిపించడం లేదంటూ Panjagutta పీఎస్‌లో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-06-27T20:22:53+05:30 IST

తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల (పప్పీ) కనిపించకుండా పోయిందంటూ పోయిందని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యజమాని ఫిర్యాదు చేశాడు.

కుక్కపిల్ల కనిపించడం లేదంటూ Panjagutta పీఎస్‌లో ఫిర్యాదు

హైదరాబాద్: తాము అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క పిల్ల(పప్పీ) కనిపించకుండా పోయిందంటూ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో యజమాని ఫిర్యాదు చేశాడు. అమీర్‌పేట నాగార్జుననగర్‌కు చెందిన దంపతులు రెండు నెలల పప్పీని పెంచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటి బయటకు వచ్చిన పప్పీని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తీసుకు వెళ్లారంటూ దంపతులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలను కూడా పోలీసులకు అందజేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2022-06-27T20:22:53+05:30 IST