ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-03-02T05:47:43+05:30 IST

కోనాడ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై స్థానికులు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు.

ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఫిర్యాదు

పూసపాటిరేగ: కోనాడ గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై స్థానికులు తహసీల్దార్‌ విజయ్‌భాస్కర్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. స్థానిక దేవాదాయశాఖకు చెందిన భూమిని కొందరు ఆక్రమించి లేఅవుట్‌కు రహదారిని నిర్మించుకుంటున్నారని వీరు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ సర్పంచ్‌ దంగా భూలోక తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2021-03-02T05:47:43+05:30 IST