దాడిపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2020-05-27T10:36:24+05:30 IST
ముళ్లకంచెను తొలగించవద్దు అని చెప్పినందుకు తనపై ఓ వ్యక్తి దాడి చేశాడంటూ మండలంలోని రామాపురం గ్రామస్థుడు వెంకటేష్ పోలీసులకు ..
తడ, మే 26 : ముళ్లకంచెను తొలగించవద్దు అని చెప్పినందుకు తనపై ఓ వ్యక్తి దాడి చేశాడంటూ మండలంలోని రామాపురం గ్రామస్థుడు వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాది వివరాల మేరకు కరోనా వల్ల గ్రామస్థుల నిర్ణయంతో గ్రామ శివార్లల్లో కంపతో కంచెను ఏర్పాటు చేశారు. వసంతకుమార్ సోమవారం రాత్రి ముళ్లకంచెను తొలగిస్తుండటంతో వెంకటేష్, అతని తల్లి అడ్డుచెప్పారు. దాంతో అతను వెంకటేష్పై కత్తితో దాడి చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమచికిత్స చేయించారు.