జడ్పీటీసీ భర్తపె ౖకాంగ్రెస్ నాయకుల ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-07-31T04:27:05+05:30 IST
ప్రొటోకాల్కు విరుద్ధంగా వ్యవహరిం చిన జడ్పీటీసీ భర్తపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు.
నర్వ, జూలై 30 : ప్రొటోకాల్కు విరుద్ధంగా వ్యవహరిం చిన జడ్పీటీసీ భర్తపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. ఎంపీడీవో కార్యా లయంలో గురువారం కల్యాణ లక్ష్మి చెక్కులు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యురాలు గౌని జ్యోతికి ఏర్పాటు చేసిన కుర్చీలో ఆమె భర్త కిరన్ ప్రకాష్రెడ్డి కూర్చోవడం ప్రొటోకాల్కు విరుద్ధం అని కాంగ్రెస్పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆయనపై చట్ట పర మైన చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, వివేక్వర్దన్, శ్రీనివాస్ రెడ్డి, శరణప్ప తహసీల్దార్ మజహరలీకి ఫిర్యాదు చేశారు.