వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-08-18T20:25:56+05:30 IST

వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దురుసుగా ప్రవర్తించారని ఎస్పీ విశాల్ గున్నికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదు చేశారు.

వైసీపీ నేతలపై టీడీపీ నేతల ఫిర్యాదు

గుంటూరు: వైసీపీ నేతలపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. తమపై దురుసుగా ప్రవర్తించారని ఎస్పీ విశాల్ గున్నికి మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తనను కులం పేరుతో దూషించారని టీడీపీ నేత పిల్లి మాణిక్యరావు ఫిర్యాదు చేశారు. జీజీహెచ్ వద్ద వైసీపీ నేతలు అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున, చైతన్య తనపై దాడి చేశారని  టీడీపీ నేతలు కనపర్తి, చిట్టిబాబు ఫిర్యాదు చేశారు. తూర్పు డీఎస్పీ సీతారామయ్యను టీడీపీ నేతలు కలసి ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2021-08-18T20:25:56+05:30 IST