అక్రమ కట్టడాలపై హైకోర్టులో ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-04-13T05:19:23+05:30 IST
అక్రమ కట్టడాలపై హైకోర్టులో ఫిర్యాదు
తాండూరు: అక్రమ కట్టడాలు, కబ్జాలు, ఆక్రమించుకుని చేపడుతున్న నిర్మాణాలను పట్టించుకోని అధికారులపై హైకోర్టులో డబ్ల్యూపీ వేసినట్లు తాండూరు మున్సిపాలిటీ బీజేపీ కౌన్సిలర్ సంగీతఠాగూర్ తెలిపారు. ఆక్ర మణలపై ఆర్డీవో అశోక్, టౌన్ ప్లానింగ్ అధికారి జీషాన్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. దీనిపై హైకోర్టులో డబ్ల్యూపీ(వైట్ పిటిషన్) వేశానన్నారు. కేసు నెంబర్ 93022021తో ఫైల్ చేశారని ఆమె తెలిపారు.