వ్యాపారి సుఖేష్గుప్తాపై ఫిర్యాదు అందింది: ఏసీపీ హరికృష్ణ
ABN , First Publish Date - 2020-03-21T14:01:36+05:30 IST
హైదరాబాద్: వ్యాపారి సుఖేష్గుప్తా రుణం తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు అందిందని సీసీఎస్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు.
హైదరాబాద్: వ్యాపారి సుఖేష్గుప్తా రుణం తీసుకుని మోసం చేశాడని ఫిర్యాదు అందిందని సీసీఎస్ ఏసీపీ హరికృష్ణ తెలిపారు. సిరి ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.110కోట్ల రుణం తీసున్నట్టు ఫిర్యాదు అందిందని వెల్లడించారు. తీసుకున్న రుణంలో కొంత రికవరీ చేశామని.. మిగిలిన డబ్బుల రికవరీ కోసం... కోఠిలోని ప్యాలెస్ను వేలం వేయడానికి వెళ్తే దానిని అప్పటికే అమ్మేశారన్నారు. దీంతో ఫైనాన్స్ కంపెనీ సీసీఎస్లో ఫిర్యాదు చేసిందని ఏసీపీ హరికృష్ణ తెలిపారు. నిందితులు సుఖేష్గుప్తా, నీతూగుప్తా, సురేష్కుమార్, రవీంద్రన్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బంజారాహిల్స్లో సుఖేష్ ఉన్నట్టు సమాచారం అందిందని తనిఖీలు చేశామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుటామని హరికృష్ణ వెల్లడించారు.