తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు
ABN , First Publish Date - 2021-12-26T01:10:26+05:30 IST
మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై క్యూ న్యూస్ వెబ్ఛానల్లో వ్యక్తిగత విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు
చౌటుప్పల్: మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షుపై క్యూ న్యూస్ వెబ్ఛానల్లో వ్యక్తిగత విమర్శలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై కఠిన చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నేత పిల్లలమరి శ్రీనివాస్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డికి శనివారం ఫిర్యాదు చేశారు. అదేవిధంగా బాలలహక్కుల కమిషన్ సభ్యుడు బృందావనరావుకు ఫిర్యాదుచేశారు. మైనర్ అయిన హిమాన్షు శరీర ఆకృతిని అవహేళనచేసి మానసిక వేదనకు గురిచేశాడని, ఇది బాలల హక్కులకు భంగం కలిగించడమేనని తెలిపారు. తక్షణమే తీన్మార్ మల్లన్నపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అయితే ఫిర్యాదు అందిందని, ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.