పోటీలను విజయవంతం చేయాలి
ABN , First Publish Date - 2020-05-29T11:46:44+05:30 IST
ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఫౌండేషన్, వి.బి.వి.ఆర్. చారిటబుల్ ..
డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), మే 28: ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఫౌండేషన్, వి.బి.వి.ఆర్. చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పర్యావరణ పోటీలను నిర్వహించనున్నామని గ్రీన్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధి కేసరి శ్రీనివాసరావు తెలిపారు. చిత్రలేఖనం, కార్టూన్ అంశాలలో ఈ పోటీలను నిర్వహిస్తామన్నారు. 5వ తరగతి నుంచి ఏ వయసు వారైనా ఈ పోటీలలో పాల్గొనవచ్చన్నారు. పర్యావణ పరిరక్షణలో ప్రజల పాత్ర అనే అంశంపై పోటీలు జరుగుతాయన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ఎంట్రీలను 99127 03697 నంబర్ గల వాట్సాప్కు పంపించాలని కోరారు. ఇతర వివరాలకు ఇదే సెల్ నంబర్లో సంప్రదించాలని కోరారు.