నిర్వాసితులకు పరిహారం అందించాలి

ABN , First Publish Date - 2022-08-09T06:15:15+05:30 IST

ఎల్లంపెల్లి శ్రీపాద ప్రాజెక్టు ముంపు గ్రామం చె గ్యాం నిర్వాసితులకు వెంటనే పూర్తి స్థాయి పరిహారం అందించాలని బీజే పీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేశారు.

నిర్వాసితులకు పరిహారం అందించాలి
చెగ్యాంలో నిర్వాసితులతో మాట్లాడుతున్న వివేక్‌ వెంకటస్వామి

బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌

వెల్గటూర్‌, ఆగస్టు 8: ఎల్లంపెల్లి శ్రీపాద ప్రాజెక్టు ముంపు గ్రామం చె గ్యాం నిర్వాసితులకు వెంటనే పూర్తి స్థాయి పరిహారం అందించాలని బీజే పీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్‌ వెంకటస్వామి డిమాండ్‌ చేశారు. చె గ్యాం గ్రామంలో నిర్వాసితులు పాఠశాలలో ఉంటున్నారనే విషయం తెలు సుకొని సోమవారం వారిని పరామర్శించారు. ఈ సందనర్భంగా ఆయన మాట్లాడుతూ పదేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం ఇ వ్వడంలో నిర్లక్ష్యం వహించడం పట్ల మండిపడ్డారు. ఇప్పటి వరకు 135 కు టుంబాలకు పూర్తిస్థాయి పరిహారం అందించకపోవడం విచారకరమన్నా రు. కలెక్టర్‌ రవితో ఫోన్‌లో మాట్లాడి నిర్వాసితులకు పరిహారం అందించే లా చూడాలని కోరారు. ఇప్పటికైనా ప్రభుత్వం నిర్వాసితులకు పరిహారం అందించాలని, లేని పక్షంలో నిర్వాసితుల పక్షాన బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉధ్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల మల్లేశం, మండల అధ్యక్షుడు చక్రపాణి, గుం త సంతోష్‌, బుద్దె బాపు, సూర్యనారాయణ పాల్గొన్నారు.


Updated Date - 2022-08-09T06:15:15+05:30 IST