భూ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి

ABN , First Publish Date - 2021-10-19T05:52:22+05:30 IST

జగనన్న లేఅవుట్లకు భూములిచ్చి పరిహారం అందని మేర్లపాక దళితులకు న్యాయం చేయాలని రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య డిమాండ్‌ చేశారు.

భూ బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి
ఆందోళన చేస్తున్న కూలీల సంఘ నాయకులు, దళితులు

ఏర్పేడు, అక్టోబరు 18: జగనన్న లేఅవుట్లకు భూములిచ్చి పరిహారం అందని మేర్లపాక దళితులకు న్యాయం చేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సంక్రాంతి వెంకటయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం ఆయన బాధిత రైతులతో కలసి తిరుపతిలో ఆర్డీవోను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటయ్య మాట్లాడుతూ పాగాలి రెవెన్యూ లెక్కదాఖలాలో 2008లో మేర్లపాక దళితులకు ప్రభుత్వం ఒకటిన్నర ఎకరా చొప్పున భూములు మంజూరు చేసిందని చెప్పారు. ఇప్పుడు పేదల ఇళ్లస్థలాల కోసం దళితుల భూములు తీసుకున్నారనీ, అయితే బాధితులకు ఇప్పటికీ పరిహారం ఇవ్వలేదని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి దళితులకు ఎకరాకు రూ.20లక్షల వంతున వెంటనే సొమ్ము చెల్లించాలన్నారు. కార్యక్రమంలో వెంకటరత్నం, లోకేష్‌, రమణ, మహేష్‌, నాగరాజు, రమేష్‌, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-19T05:52:22+05:30 IST