పరిహారం ఇచ్చాక... రెండేళ్లు గడువు ఇవ్వాలి

ABN , First Publish Date - 2020-05-21T10:46:39+05:30 IST

పరిహారం ఇచ్చాక... రెండేళ్లు గడువు ఇవ్వాలి

పరిహారం ఇచ్చాక... రెండేళ్లు గడువు ఇవ్వాలి

కొండాపురం, మే 20: గండికోట ప్రాజెక్టు కింద పరిహారం, పునరావాసం కింద స్థలం ఇచ్చిన తర్వాత ఖాళీ చేయించేందుకు రెండేళ్లు గడువు ఇవ్వాలని మండల బీజేపీ కన్వీనర్‌ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. తాళ్లప్రొద్దుటూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పరిహారం ఇచ్చిన వెంటనే ఖాళీ చేయిస్తామని అధికారులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. తాళ్లప్రొద్దుటూరులో 1500కుటుంబాలు ఉన్నాయన్నారు. వీరికి ఇంకా పునరావాసం కింద స్థలాన్ని కేటాయించలేదన్నారు. ప్రస్తుతం లాక్‌డౌన్‌ దృష్ట్యా ఇళ్లు కట్టుకోవడానికి కనీసం రెండేళ్లు సమయం పడుతుందని, అలాంటప్పుడు వెంటనే ఖాళీ చేయమంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు.  

Updated Date - 2020-05-21T10:46:39+05:30 IST