భూములకు పరిహారం ఇప్పించండి
ABN , First Publish Date - 2022-09-24T05:42:26+05:30 IST
భూములకు పరిహారం ఇప్పించండి
ఇబ్రహీంపట్నం, సెప్టెంబరు 23: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు ఆయకట్టుకు నీరు వదలాలని లేదంటే చెరువు ఎఫ్టీఎల్లో భూములకు పరిహారం ఇప్పించాలని రైతులు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కోరారు. చెర్లపటేల్గూడ, కర్నంగూడ, ఉప్పరిగూడ, పోచారం గ్రామాలకు చెందిన రైతులు ఎంపీపీ కృపేష్, సర్పంచులు బూడిద రాంరెడ్డి, కంబాలపల్లి గీతారాంరెడ్డి, వంగేటి కవితా తిరుమల్రెడిలతో కలిసి శుక్రవారం ఇబ్రహీంపట్నం క్యాంపు కార్య్యాలయంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్ద చెరువు నీరు వదిలితే 1200ఎకరాల ఆయకట్టు భూములు సాగులోకి వస్తాయని తెలిపారు. ఈ విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుని రైతులకు న్యాయం జరిగేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
యాచారం: మండలంలోని గున్గల్కు చెందిన దేవేందర్ ఇటీవల దీర్ఠకాలిక వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందగా బాధితుడికి సీఎంఆర్ఎఫ్ ద్వారా రూ.28వేలు మంజూరయ్యాయి. ఈ చెక్కును ఎమ్మెల్యే లబ్ధిదారుడికి శుక్రవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ, మాజీ జడ్పీటీసీ కె.రమే్షగౌడ్, సొసైటీ చైర్మన్ టి.రాజేందర్రెడ్డి, సర్పంచ్ కె.ఇందిరశ్రీనివాస్, నాయకులు ఓరుగంటి యాదయ్య, రమేష్ పాల్గొన్నారు.