పరిహారం, పునరావాసం కల్పించాలి
ABN , First Publish Date - 2022-08-14T06:02:32+05:30 IST
పరిహారం, పునరావా సం కల్పించాలని మండ లంలోని లక్ష్మణాపురం గ్రా మస్థులు డిమాండ్ చేశా రు.
మర్రిగూడ, ఆగస్టు 13: పరిహారం, పునరావా సం కల్పించాలని మండ లంలోని లక్ష్మణాపురం గ్రా మస్థులు డిమాండ్ చేశా రు. శనివారం కిష్టరాయన పల్లి ప్రాజెక్టు ముంపు ని ర్వాసితులైన లక్ష్మణాపురం గ్రామస్థులు అడ్డుకున్నా రు. ఈ సందర్భంగా వా రు మాట్లాడుతూ రిజర్వాయర్ కింద వేలాది ఎకరాలు, గృహాలను కూడా కోల్పో యి నిస్సాహాయ స్థితిలో ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రిజర్వాయర్ శంకుస్థాపనలో కార్యక్రమంలో ముంపు నిర్వాసితులకు ప్రభుత్వం ఆదుకుంటుందని ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. అధికారులు స్పందించి లక్ష్మణాపురం బాధితులకు భూపరిహారం, పునరావాసం, ఆర్అండ్ఆర్ ప్రత్యేక ప్యాకేజీ అందించాలని డిమాండ్ చేశారు. కిష్టరాయనపల్లి రిజర్వాయర్ పనులను అడ్డుకుంటున్నారని తెలుసుకున్న నాంపల్లి పోలీసులు రిజర్వాయర్ వద్దకు వచ్చి ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుంది, పనులకు సహకరించాలని తెలిసినా వినకుండా పను లు జరగనివ్వమని తేల్చిచెప్పడంతో అధికారులు వెనుదిరిగి వెళ్లడంతో పనులను సాగకుండా నిలిపివేశారు. అనంతరం భూనిర్వాసితులకు తన ఇళ్లకు వెళ్లారు.