స్త్రీలకే మెడనొప్పి ఎక్కువ

ABN , First Publish Date - 2020-04-04T16:39:04+05:30 IST

మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం కారణంగా తలెత్తే మెడనొప్పి.. పురుషుల్లో కన్నా మహిళల్లో 138 రెట్లు ఎక్కువగా ఉంటుందన్న సంగతి తాజా అధ్యయనంలో తేలింది. సుమారు

స్త్రీలకే మెడనొప్పి ఎక్కువ

ఆంధ్రజ్యోతి(04-04-2020)

మెడ వద్ద వెన్నుపూసల మధ్య డిస్కులు అరగటం కారణంగా తలెత్తే మెడనొప్పి.. పురుషుల్లో కన్నా మహిళల్లో 138 రెట్లు ఎక్కువగా ఉంటుందన్న సంగతి తాజా అధ్యయనంలో తేలింది. సుమారు 3,337 మందిపై అధ్యయనం చేసి ఈ విషయాన్ని గుర్తించారు. నొప్పి కలగటంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు ఉంటాయనే సంగతిని ఇది మరింత బలపరిచింది. పార్శ్వనొప్పి, ఒళ్లు నొప్పుల వంటివి కూడా స్త్రీలలో ఎక్కువని గత అధ్యయనాల్లో వెల్లడైంది. వెన్నుపూసల మధ్య డిస్కులు అరగంట మూలంగా మెడ బిగుసుకుపోవటం, మంట, నొప్పి, మొద్దుబారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. తలను పైకెత్తినపుడు లేదా కదిల్చినప్పుడు నొప్పి తలెత్తుతుందనీ, అయితే ఈ లక్షణాలను స్త్రీలు నిర్లక్ష్యం చేయడం వల్ల సమస్య తీవ్రమవుతోందని వారు చెబుతున్నారు.

Updated Date - 2020-04-04T16:39:04+05:30 IST