శిష్ట కరణాలను ఓబీసీలో చేర్చండి

ABN , First Publish Date - 2021-03-05T07:44:35+05:30 IST

సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ‘శిష్టకరణాల‘ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ సంఘ జాతీయ సాధన సమితి కన్వీనర్‌ బి.కృష్ణారావు కోరారు. ఈ మేరకు వెనుకబడిన

శిష్ట కరణాలను ఓబీసీలో చేర్చండి

ఎన్సీబీసీ చైర్‌పర్సన్‌తో సంఘం భేటీ


న్యూఢిల్లీ, మార్చి4(ఆంధ్రజ్యోతి): సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ‘శిష్టకరణాల‘ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ సంఘ జాతీయ సాధన సమితి కన్వీనర్‌ బి.కృష్ణారావు కోరారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌(ఎన్సీబీసీ) చైర్‌పర్సన్‌ డా.భగవాన్‌ లాల్‌ సాహ్నికి ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణారావు మాట్లాడారు. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఢిల్లీ వచ్చి, ఎన్సీబీసీ కమిషన్‌ను కలిశామన్నారు.  

Updated Date - 2021-03-05T07:44:35+05:30 IST