శిష్ట కరణాలను ఓబీసీలో చేర్చండి
ABN , First Publish Date - 2021-03-05T07:44:35+05:30 IST
సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ‘శిష్టకరణాల‘ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ సంఘ జాతీయ సాధన సమితి కన్వీనర్ బి.కృష్ణారావు కోరారు. ఈ మేరకు వెనుకబడిన
ఎన్సీబీసీ చైర్పర్సన్తో సంఘం భేటీ
న్యూఢిల్లీ, మార్చి4(ఆంధ్రజ్యోతి): సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ‘శిష్టకరణాల‘ సామాజిక వర్గాన్ని ఓబీసీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆ సంఘ జాతీయ సాధన సమితి కన్వీనర్ బి.కృష్ణారావు కోరారు. ఈ మేరకు వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ) చైర్పర్సన్ డా.భగవాన్ లాల్ సాహ్నికి ఆయన వినతి పత్రం సమర్పించారు. అనంతరం కృష్ణారావు మాట్లాడారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఢిల్లీ వచ్చి, ఎన్సీబీసీ కమిషన్ను కలిశామన్నారు.