కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలి

ABN , First Publish Date - 2022-05-15T06:35:49+05:30 IST

రామారావు బాగ్‌ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తమకు సంఘ భవనం మంజూరు చేయాలని కోరుతూ శనివారం నాడు మహిళలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతి చేశారు.

కమ్యూనిటీ హాల్‌ను మంజూరు చేయాలి
మంత్రిని కలిసిన డ్వాక్రా మహిళలు

మంత్రికి మహిళా సంఘం వినతి

నిర్మల్‌ కల్చరల్‌, మే 14 : రామారావు బాగ్‌ డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు తమకు సంఘ భవనం మంజూరు చేయాలని కోరుతూ శనివారం నాడు మహిళలు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి వినతి చేశారు. మంత్రి నివాసంలో 300ల మంది మహిళలు జాబిలమ్మ కమ్యూనిటీ హాల్‌ మంజూరు చేయాలని కోరారు. మంత్రి స్పందించి వెంటనే పది లక్షల రూపాయలు మంజూరు చేశారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఈశ్వర్‌, ఎఫ్‌ఏసీఎస్‌ చైర్మన్‌ ధర్మాజీ రాజేందర్‌, కౌన్సిలర్‌ ఏ. రమాదేవి, పూదరి రాజేశ్వర్‌, తదితర నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-05-15T06:35:49+05:30 IST