కమ్యూనిటీ హాలు మంజూరు చేయాలి
ABN , First Publish Date - 2021-10-28T05:25:25+05:30 IST
పట్టణంలోని బ్రాహ్మణ సంఘానికి నూతనంగా కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు.
- ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి బ్రాహ్మణ సంఘం నాయకుల వినతి
బాదేపల్లి, అక్టోబరు 27 : పట్టణంలోని బ్రాహ్మణ సంఘానికి నూతనంగా కమ్యూనిటీ భవనం మంజూరు చేయాలని బ్రాహ్మణ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బ్రాహ్మ ణ సంఘం నాయకులు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సి. లక్ష్మారెడ్డికి బుధవారం వినతిపత్రం అం దజేశారు. త్వరలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చా రని సంఘం నాయకులు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు దోరేపల్లి రవీందర్, బ్రాహ్మ ణ సంఘం అధ్యక్షులు సుమన్ శర్మ, సభ్యులు పాల్గొన్నారు.
బాదేపల్లి మార్కెట్లో పత్తి క్రయ, విక్రయాలు ప్రారంభం
జడ్చర్ల, అక్టోబరు 27 : బాదేపల్లి పత్తి మార్కెట్లో బుధవారం పత్తి క్రయ, విక్రయాలను జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ప్రారంభించారు. మార్కెట్కు నాణ్యతతో పత్తిని తీసుకురావాలని రైతులకు సూచించారు. మొదటిరోజు 13 మంది రైతులు 134 బస్తాలతో 47క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకువచ్చారు. క్వింటాలుకు గరిష్టంగా రూ.8139, కనిష్టంగా రూ.7599, మాడల్ధరగా రూ.7809 ధర పలికింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్ బాద్మిశివకుమార్, బాదేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రేపల్లిలక్ష్మయ్య, జడ్పీ వైస్చైర్మన్ కోడ్గల్యాదయ్య, డైరెక్టర్ మాదారంభాస్కర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మండలంలోని గొల్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలో సర్పంచ్ రాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పరిశీలించారు.