కమ్యూనిస్టులు ఏకతాటి పైకి రావాలి

ABN , First Publish Date - 2022-08-08T04:05:13+05:30 IST

కాషాయ, కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం జాతీయ కార్యదర్శి రాంచంద్రన్‌ పేర్కొన్నారు. ఆదివారం సీపీఎం అనుబంధ రెడ్‌ స్టార్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ దోపిడీ, ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి వామపక్ష కమ్యూనిస్టులు ఏకతాటిపైకి రావాలన్నారు.

కమ్యూనిస్టులు ఏకతాటి పైకి రావాలి
మాట్లాడుతున్న సీపీఎం జాతీయ కార్యదర్శి రాంచంద్రన్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 8: కాషాయ, కార్పొరేట్‌ శక్తులకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని సీపీఎం జాతీయ కార్యదర్శి రాంచంద్రన్‌ పేర్కొన్నారు. ఆదివారం సీపీఎం అనుబంధ రెడ్‌ స్టార్‌ రాష్ట్ర తృతీయ మహాసభలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కార్పొరేట్‌ దోపిడీ, ప్రజావ్యతిరేక విధానాలను ఎదుర్కోవడానికి వామపక్ష కమ్యూనిస్టులు ఏకతాటిపైకి రావాలన్నారు. విప్లోద్యమాలను బలోపేతం చేయాలని పిలుపుని చ్చారు. నాయకులు జిల్లా కార్యదర్శి దేవరాజు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-08T04:05:13+05:30 IST