కంటైన్మెంట్ ప్రాంతాల్లో రాకపోకలు నిలిపివేయాలి
ABN , First Publish Date - 2020-07-01T09:57:15+05:30 IST
కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాలో రాకపోకలు నిలిపివేయాలని కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. స్థానిక నల్లచెరువు,
నగర కమిషనర్ అనురాధ
గుంటూరు (కార్పొరేషన్), జూన్ 30: కరోనా నిర్ధారణ అయిన ప్రాంతాలో రాకపోకలు నిలిపివేయాలని కమిషనర్ చల్లా అనురాధ తెలిపారు. స్థానిక నల్లచెరువు, రామిరెడ్డివారితోట, గుంటూరువారి తోట తదితర ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తక్షణమే బ్యారికేడ్లు ఏర్పాటు చేయాలని సంబంధిత ఏఈని ఆదేశించారు. పలు ప్రాంతాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో కమిషనర్తో పాటు డీఈఈ వెంకటరమణ, బయాలజిస్ట్ ఓబులు, ఎస్ఎస్ రాంబాబు, ఏఈలు సాంబశివరావు, పవన్, శానిటరీ ఇన్సెపెక్టర్లు ఐజాక్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.