Commonwealth Games: సెమీస్ బెర్త్ ఖరారు చేసుకున్న టీమిండియా హాకీ జట్టు
ABN , First Publish Date - 2022-08-05T02:28:12+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. క్రీడల ఏడో రోజు కూడా భారత క్రీడాకారులు పలు విభాగాల్లో
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్లో భారత క్రీడాకారుల హవా కొనసాగుతోంది. క్రీడల ఏడో రోజు కూడా భారత క్రీడాకారులు పలు విభాగాల్లో సత్తా చాటారు. బాక్సింగ్లో అమిత్ పంఘల్, జైస్మిన్ లంబోరియా, సాగర్ అహ్లావత్లు మెన్స్ ఫ్లైవెయిట్, మహిళల లైట్వెయిట్, పురుషుల సూపర్ హెవీవెయిట్ క్వార్టర్ ఫైనల్స్లో విజయాలు సాధించి సెమీస్కు దూసుకెళ్లారు. ఫలితంగా కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమైనట్టే. అలాగే, వేల్స్తో జరిగిన పురుషుల హాకీ క్వార్టర్స్లో తిరుగులేని విజయం సాధించిన భారత జట్టు సెమీస్లో అడుగుపెట్టింది.
అథ్లెటిక్స్లో హిమదాస్(hima das) 200 మీటర్ల సెమీస్లోకి ప్రవేశించింది. హేమర్ త్రోలో మంజుబాల (manju bala) ఫైనల్లోకి ప్రవేశించింది. సింగిల్స్ రౌండ్ ఆఫ్ 32 మ్యాచ్లలో షట్లర్లు పీవీ సింధు (PV Sindhu), కిడాంబి శ్రీకాంత్(Kidambi Srikanth) విజయం సాధించారు. కామన్వెల్త్లో భారత్కు ఇప్పటి వరకు 18 పతకాలు లభించాయి. ఇందులో ఐదు స్వర్ణాలు ఉన్నాయి.