Commonwealth Games: చెలరేగిపోతున్న స్మృతి మంధాన.. 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి
ABN , First Publish Date - 2022-08-06T21:23:15+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో నేడు కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్
బర్మింగ్హామ్: కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో నేడు కీలక మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి సెమీఫైనల్ మ్యాచ్లో హర్మన్ప్రీత్ కౌర్ సేన టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. క్రీజులోకి వస్తూనే భారత ఓపెనర్ స్మృతి మంధాన బ్యాట్కు పని చెప్పింది.
ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తోంది. మరో ఓపెనర్ షెఫాలీ వర్మ ఆమెకు అండగా నిలుస్తూ నిదానంగా ఆడుతోంది. ఫోర్లు, సిక్సర్లతో దాడి ప్రారంభించిన స్మృతి.. 23 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఏడు ఓవర్లు ముగిశాయి. భారత జట్టు వికెట్ నష్టపోకుండా 73 పరుగులు చేసింది. మంధాన 59, షెఫాలీ వర్మ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.