ఆలయాల రక్షణకు కమిటీలు
ABN , First Publish Date - 2021-01-19T05:36:45+05:30 IST
ఆలయాల రక్షణకు గ్రామస్థులతో కలిసి కమిటీలు వేయనున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ మాతె మహేంద్ర తెలిపారు. కుంచాలకురమయ్యపేటలోని దేవీ ఆశ్రమాన్ని ఆయన సోమవారం సందర్శించారు.
ఎచ్చెర్ల: ఆలయాల రక్షణకు గ్రామస్థులతో కలిసి కమిటీలు వేయనున్నట్లు శ్రీకాకుళం డీఎస్పీ మాతె మహేంద్ర తెలిపారు. కుంచాలకురమయ్యపేటలోని దేవీ ఆశ్రమాన్ని ఆయన సోమవారం సందర్శించారు. గ్రామంలోని పెద్దలు, వలంటీర్లు, ఆలయ మేనేజ్మెంటు సభ్యులతో కలిసి కమిటీలను వేస్తున్న ట్టు చెప్పారు. ఆలయాలను పరిరక్షించే బాధ్యతను ఈ కమిటీలకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. కమిటీ సభ్యులకు తెలుపు రంగు టీ షర్టులను పంపిణీ చేశారు. ఈ కార్యక్ర మంలో ఎచ్చెర్ల ఎస్ఐ జి.రాజేష్, దోమాం మాజీ సర్పంచ్ బచ్చు కోటిరెడ్డి, బచ్చు నర్సింగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.