నాగోబాను దర్శించుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్
ABN , First Publish Date - 2021-01-16T05:33:13+05:30 IST
మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను గురువారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇంద్రవెల్లి, జనవరి 15: మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను గురువారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యదేవరాజన్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంందర్భంగా కేస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకనాగనాథ్ పుష్పగుచ్ఛం అందజేసి శాలువో సన్మానించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీ చరిత్ర పుస్తకం అందించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్రావు, జడ్పీటీసీ సభ్యురాలు అర్క పుష్పలత, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం భీంరావు, మెస్రం తుకారం, అర్క ఖమ్ము, మెస్రం నాగ్నాథ్, మెస్రం ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.