నాగోబాను దర్శించుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌

ABN , First Publish Date - 2021-01-16T05:33:13+05:30 IST

మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను గురువారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

నాగోబాను దర్శించుకున్న మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌
దివ్యదేవరాజన్‌కు నాగోబా చరిత్ర పుస్తకాన్ని అందజేస్తున్న నాయకులు

ఇంద్రవెల్లి, జనవరి 15: మండలంలోని కేస్లాపూర్‌ గ్రామంలో ఆదివాసీ గిరిజనుల ఆరాధ్యదైవం నాగోబాను గురువారం రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన్‌ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సంందర్భంగా కేస్లాపూర్‌ సర్పంచ్‌ మెస్రం రేణుకనాగనాథ్‌ పుష్పగుచ్ఛం అందజేసి శాలువో సన్మానించారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో ఆదివాసీ చరిత్ర పుస్తకం అందించారు. ఈ కార్యక్రమంలో నాగోబా ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు అర్క పుష్పలత, ఆదివాసీ సంఘాల నాయకులు సిడాం భీంరావు, మెస్రం తుకారం, అర్క ఖమ్ము, మెస్రం నాగ్‌నాథ్‌, మెస్రం ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T05:33:13+05:30 IST