ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన

ABN , First Publish Date - 2020-10-23T11:45:04+05:30 IST

జల సహకారంతోనే కరోనాను నిర్మూలించవచ్చని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు పాటిస్తూ కరోనాను ...

ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన

 కమిషనర్‌ లవన్న


కడప(ఎర్రముక్కపల్లె), అక్టోబరు 22: ప్రజల సహకారంతోనే కరోనాను నిర్మూలించవచ్చని కమిషనర్‌ లవన్న పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన నిబంధనలు పాటిస్తూ కరోనాను తరిమికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. కరోనాపై ప్రజల్లో నిర్లక్ష్యాన్ని రూపుమాపేందుకు కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్‌ నుంచి కోటిరెడ్డిసర్కిల్‌ వరకు కొనసాగిన ర్యాలీని కమిషనరు లవన్న జెండా ఊపి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ లాక్‌డౌన్‌ ఎత్తేయడంతో ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని, చాలా మంది మాస్కులు లేకుండా భౌతికదూరం పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయా సచివాలయ పరిధిలో కూడా ర్యాలీలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ సత్యనారాయణ, అడిషనల్‌ కమిషనరు సుబ్బారావు, డిప్యూటీ కమిషనరు రమణారెడ్డి, ఈఈ భాస్కర్‌రావు, ధనలక్ష్మి, ఎంహెచ్‌వో శ్రీనివాసులరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-23T11:45:04+05:30 IST