అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించాలి

ABN , First Publish Date - 2020-12-03T05:17:52+05:30 IST

రోడ్లు,కాలువల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే బిల్లుల చెల్లింపు నిలుపుదల చేస్తామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు.

అభివృద్ధి పనుల్లో ప్రమాణాలు పాటించాలి

నగర కమిషనర్‌ చల్లా అనురాధ

గుంటూరు (కార్పొరేషన్‌),  డిసెంబరు 2: రోడ్లు,కాలువల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకుంటే బిల్లుల చెల్లింపు నిలుపుదల చేస్తామని నగర కమిషనర్‌ చల్లా అనురాధ స్పష్టం చేశారు. తారకరామనగర్‌, పందుల కాలని, వాసవినగర్‌ తదితర ప్రాంతాల్లో బుధవారం పర్యటించి పలు అభివృద్ధి పనులు, పారిశుధ్యం తనిఖీచేసి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కలిగించాలని, ముఖ్యంగా వ్యర్ధాలను కాలువలు,  రోడ్లపై వేయకుండా చూడాలని వ్యర్ధాలను తడి, పొడి చెత్తలుగా విభజించి అందజేసేలా ప్రజలకు మైక్‌ ప్రచారం ద్వారా ఆయా కార్యదర్శులు, వలంటీర్లు తెలియచేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్‌ బి.శ్రీనివాసరావు, ఈఈ శాంతి రాజు, డీఈఈ ప్రసాద్‌, టీపీఎస్‌ స్రవంతి, ఏఈ దుర్గాప్రసాద్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రత్నం, సెక్రటరీలు, వలంటీర్లు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:17:52+05:30 IST